ఆరోగ్య సూచీల్లో ఆంధ్ర ప్రదేశ్ ఫస్ట్
మనం చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే గుర్తింపు దానంతట అదే వస్తుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా వైఎస్ జగన్ రెడ్డి సర్కార్ నిలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణే రాష్ట్ర ధ్యేయంగా వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్ర ప్రభుత్వం తొలినుంచీ ముందడుగు వేస్తోంది. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వంటి అనేక కార్యక్రమాల అమలు చేయడం ద్వారా ప్రజారోగ్యానికి భరోసాగా రాష్ట్రం నిలుస్తోంది. నీతిఆయోగ్ విడుదల చేస్తున్న ఆరోగ్య సూచీల్లో ఆంధ్ర ప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటోంది.
రక్తహీనత నివారణ చర్యల్లో రాష్ట్రం భేష్
రక్తహీనత నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీని నివారణకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ కి జాతీయ స్థాయిలో మొదటి అవార్డు లభించింది. అంగన్వాడీలు, పాఠశాలల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోష ణ ప్లస్, జగనన్న గోరుముద్ద వంటి కార్యక్రమాల కింద రాష్ట్ర ప్రభుత్వం పోషకాహారం పంపిణీ చేస్తోంది. స్కూల్ హెల్త్ యాప్తో విద్యార్థుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షణ చేపడుతోంది.
డిజిటల్ వైద్య సేవల్లో ఫస్ట్
రాష్ట్ర ప్రజలకు డిజిటల్ వైద్యసేవల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్ర ప్రదేశ్ నిలుస్తోంది. పౌరులకు డిజిటల్ హెల్త్ అకౌంట్లు సృష్టించి, అందులో వారి ఆరోగ్య వివరాలను అప్లోడ్ చేయడం, భవిష్యత్లో వారు పొందే వైద్య వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేస్తున్నారు. మొత్తం జనాభాలో అత్యధికులకు హెల్త్ అకౌంట్లు సృష్టించడంతో పాటు ఆస్పత్రుల్లోనూ డిజిటల్ వైద్యసేవల కల్పనలో ఆంధ్ర ప్రదేశ్ కి ఇప్పటికే జాతీయస్థాయిలో అనేక మొదటి బహుమతులు లభించాయి అని చెప్పవచ్చు.
డిజిటల్ వైద్య సేవల కల్పనలో ఇతర రాష్ట్రాలు సైతం ఆంధ్రప్రదేశ్ విధానాలను అవలంభించాలని అన్ని రాష్ట్రాలకు నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో లేఖ రాశారు. రాష్ట్రంలోని పౌరులకు టెలీ మెడిసిన్ సేవల కల్పనలో దేశంలో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలుస్తోంది. 2019 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 20.41 కోట్లకు పైగా టెలీకన్సల్టేషన్లు నమోదు అయితే ఇందులో 25 శాతానికి పైగా టెలీకన్సల్టేషన్లు కేవలం ఏపీ నుంచే ఉంటున్నాయి అని తెలియ చేసారు.
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా మధ్యతరగతి, పేద కుటుంబాల ఆరోగ్యానికి సీఎం జగన్ గారి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఈ పథకానీ పరిధిలోకి తెచ్చింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లోని 95 శాతం కుటుంబాలకు ఆరోగ్యబీమా లభిస్తోంది. అత్యధిక జనా భాకు పూర్తి ఆరోగ్య బీమా కలి్పస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని నీతిఆయోగ్ ప్రశంసించింది.
2019 నుంచి ఇప్పటివరకు వైద్యరంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలివీ.
► వైద్య శాఖలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేసింది. ఎప్పటి ఖాళీలకు అప్పుడే యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ప్రభుత్వం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు ► రూ.16,852 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతోపాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల బలోపేతం
►గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు. 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు
►దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు
► టీడీపీ హయాంలో నిర్విర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్య 1,059 నుంచి 3,257కు పెంపు. వైద్య ఖర్చుల పరిమితి రూ.25 లక్షలకు పెంపు ►108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్య సేవలు బలోపేతం.